Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వస్తున్న కారు.. ఆగిఉన్న ఓ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు, లారీ దగ్ధం కావడంతో ఒకరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం!
New Update

Road Accident : సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వస్తున్న కారు.. ఆగి ఉన్న ఓ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు, లారీ దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య

ఇదిలాఉండగా.. సూర్యాపేటలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇక వరంగల్ జిల్లాలో కూడా బైక్‌ వెళ్తూ ఓ ప్రైవేట్‌ బస్సు(Private Bus) ను ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు(Inter Students) మృతి చెందారు. వర్థన్నపేట మండలం ఆంకేరు వాగు వంతెన వద్ద ఈ ఘటన జరిగింది.

Also Read: మోడీ హిందూ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు: చాడ వెంకటరెడ్డి

#telugu-news #sangareddy-accident #road-accident #telangana-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి