BRS Chief KCR: సంగారెడ్డి పేలుడు ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి
సంగారెడ్డి జిల్లా పరిశ్రమలో పేలుడువల్ల జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ సంతాపం ప్రకటించారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.