Terror Attack :కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కాశ్మీర్లో కథువాలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అక్కడి అంతర్జాతీయ సరిహద్దుకి దగ్గరలో హీరానగర్ సెక్టార్లోని కథువాలో సైదా గ్రామంలో ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ముందుగా వీరిని గుర్తించిన గ్రామస్తులు అధికారులను అప్రమత్తం చేశారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతాదళాలు వెంటనే గ్రామానికి చేరుకుని ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ముష్కరులు దగ్గరలోని అడవుల్లోకి పారిపోయేందుకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు, బీఎస్ఎఫ్ అనుమానిత వ్యక్తుల కోసం జాయింట్ ఆపరేషన్ ప్రారంభించింది.
పూర్తిగా చదవండి..Jammu-kashmir: కథువాలో ఎన్కౌంటర్..ఒక ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఒక ఉగ్రవాది మరణించారు. రెండు రోజుల తేడాలో జమ్మూ కాశ్మీర్లో రెండు ఉగ్రదాడులు జరిగాయి.
Translate this News: