YS Sharmila : వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఫొటో, వీడియోస్.. వైరల్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి మ్యారేజ్ రాజస్థాన్లోని జోధ్పుర్ ప్యాలెస్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. 16న మొదలైన మూడు రోజుల పెళ్లి వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి. వెడ్డింగ్ ఫొటో, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. By srinivas 18 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Raja Reddy Marriage : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కుమారుడు రాజారెడ్డి మ్యారేజ్(Raja Reddy Marriage) రాజస్థాన్(Rajasthan) లోని జోధ్పుర్ ప్యాలెస్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా వివాహ వేడుక జరగగా.. పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘హల్దీ’ వేడుక ఫొటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా(Social Media) వేదికగా షేర్ చేశారు. ఈ ఫొటోల్లో నూతన దంపతులు రాజారెడ్డి-ప్రియా(Priya), వైఎస్ విజయమ్మ, షర్మిల-అనిల్ దంపతులు, కూతురు అంజలి, వధువు అట్లూరి ప్రియా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సందడి చేశారు. అయితే ఫిబ్రవరి 16న మొదలైన మూడు రోజుల పెళ్లి వేడుకలు ఆదివారం ముగిశాయి. ఇప్పటికే సంగీత్, మెహందీ, పెళ్లి వంటి కార్యక్రమాలు బంధువులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా జరిగాయి. ఆదివారం సాయంత్రం తలంబ్రాలు, విందు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. #videos-viral #marriage-photos #sharmila-son-raja-reddy-haldi-photos #ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి