Madanapalli: వైసీపీ యువ నాయకుడి దారుణ హత్య! అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురైయ్యాడు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను అతి దారుణంగా, కిరాతకంగా నరికి చంపేశారు. By Bhavana 25 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి YCP Leader Murdered: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి (Punganuru Sheshadri) దారుణ హత్యకు గురైయ్యాడు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను అతి దారుణంగా, కిరాతకంగా నరికి చంపేశారు. వైసీపీ యువ నాయకుడి దారుణ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మదనపల్లె. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐ వల్లి భాష, యువరాజు, శేఖర్ లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొరకు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి అధికారులు తరలించారు. కేసు నమోదు చేసుకుని,దర్యాప్తు చేస్తున్నట్లు మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. Also Read: బంగాళాఖాతంలో రెమాల్..వారికి వానలు..మనకి మండే ఎండలు! #young-leader #madanapalli #murder #ycp #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి