Balineni Srinivasa Reddy: త్వరలో టీడీపీలోకి వైసీపీ మాజీ మంత్రి.. క్లారిటీ

AP: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు. కొన్ని ఛానెల్స్ తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Balineni Srinivasa Reddy: త్వరలో టీడీపీలోకి వైసీపీ మాజీ మంత్రి.. క్లారిటీ
New Update

Balineni Srinivasa Reddy: అజ్ఞాతం వీడారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. దాదాపు 40 రోజుల తరువాత ఒంగోలు (Ongole) నగరానికి వచ్చారు. జూన్ 04 ఎన్నికల కౌంటింగ్ తరువాత నగరాన్ని వీడిన బాలినేని కుటుంబం.. తాగాజా ఒంగోలుకు వచ్చారు. వారికి ఘనస్వాగతం పలికారు వైసీపీ పార్టీ శ్రేణులు.

పార్టీ మార్పుపై క్లారిటీ..

తనపై వస్తున్న ఆరోపణలు అంతా అవాస్తవం అని అన్నారు బాలినేని. ఏవైనా ఆధారాలు ఉంటే ముందుకు రావాలని అన్నారు. కొన్ని చానల్స్ కావాలని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారను.. అవసరం లేదని స్పష్టం చేశారు. తాను YCP లోనే కొన సాగుతాను... మరోసారి పోటీలో ఉంటా అని తేల్చి చెప్పారు. కార్యకర్థలకోసం .. బాలినేని అభిమానులకోసం తాను భరిలో నిలుస్తాను అని అన్నారు. త్వరలోనే అన్ని విషయాలకు సమాధానం చెబుతానని చెప్పారు.

Also Read: మిథున్ రెడ్డి, పొంగులేటితో పాటు.. ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిన ప్రముఖులు వీరే!

#tdp #ycp #balineni-srinivasa-reddy #ap-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి