ప్రేమకు అంగీకరించలేదని యువతి, ఆమె తల్లిపై యాసిడ్‌తో దాడి..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణం జరిగింది. తన ప్రేమకు అంగీకరించలేదనే కారణంతో ఒక యువకుడు.. తాను ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లిపై యాసిడ్‌తో దాడి చేశాడు. సమాచారం మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం తల్లికూతుర్లు చికిత్స తీసుకుంటున్నారు.

New Update
హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!

ఈమధ్య ప్రేమకు అంగీకరించలేదని, బ్రేక్ అప్‌ చెప్పిందనే కారణాలతో పలుచోట్లు దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఒక యువకుడు.. తాను ప్రేమించిన యువతి, ఆమె తల్లిపై యాసిడ్‌తో దాడి చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. చివరికి నిందితుడ్ని అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆ నిందితుడు తన ఇంటికి సమీపంలోనే ఉన్న ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆమె మాత్రం అతడి ప్రేమకు అంగీకరించలేదు. దీంతో అతడు ఆమెపై కోపం పెంచుకున్నారు.

Also read: ఆడపిల్ల పుడితే రూ.2 లక్షలు, విద్యార్థినులకు ఉచిత స్కూటీ.. సంచలన హామీలు!

అయితే ఓ రోజు ఆ యువతి తన తల్లితో కలిసి ఇంట్లో పనిచేసుకుంటోంది. ఇంతలోనే అతడు వచ్చి ఆ యువతిపై తన తల్లిపై దాడి చేసి వారిపై యాసిడ్ పోశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు తల్లి కూతుర్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత వైద్యులు వారిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం వారు తమ ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. చివరికి పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరింత విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Also Read: అమిత్‌ షా పర్యటన పార్టీ కేడర్‌లో జోష్‌ నింపుతుందా!.. 18న సకల జనుల సంకల్ప సభకు హాజరు

Advertisment
తాజా కథనాలు