Telangana: పండుగ పూట విషాదం.. భార్యాభర్తలు మృతి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో విషాదం చోటుచేసుకుంది. బానోత్ షమీనా అనే మహిళ దుస్తులు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ వైర్‌ తగిలి షాక్‌కు గురైంది. భార్యను రక్షించే క్రమంలో భర్త శ్రీనుకు కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఈ దుర్ఘటనలో భార్యభార్తలిద్దరూ మృతి చెందారు.

AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?
New Update

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో దారుణం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో భార్యభర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. బానోత్ షమీనా అనే మహిళ దుస్తులు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ వైర్‌ తగిలి షాక్‌కు గురైంది. ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమె అరుపులు విన్న భర్త శ్రీను పరిగెత్తుకొని వచ్చాడు. భార్యను రక్షించే క్రమంలో అతడు కూడా కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. కొద్ది క్షణాల వ్యవధితో భార్యభార్తలిద్దరూ ప్రణాలు విడిచారు. దీంతో బస్వాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also read: ఆర్మీ జవాన్లకు రాఖీ కట్టిన మహిళలు.. వీడియో వైరల్

#khammam #current-shock
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe