సీఎం జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచే.. మంత్రి మేరుగు కీలక వ్యాఖ్యలు

నియోజకవర్గ మార్పుపై స్పందించారు మంత్రి మేరుగ నాగార్జున. సీఎం జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీలో వైసీపీ 175కి 175 సీట్లు గెలిచేలా అందరు కృషి చేయాలని అన్నారు.

New Update
సీఎం జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచే.. మంత్రి మేరుగు కీలక వ్యాఖ్యలు

Merugu Nagarjuna: మంత్రి మేరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తాన‌ని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. టార్గెట్ 175 ల‌క్ష్యంగా 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేర‌కు 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించిందని అన్నారు. మేరుగు నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ మార్పుపై తొలిసారి స్పందించిన మంత్రి మేరుగు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: BREAKING: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తనకు నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు వైయ‌స్ జ‌గ‌న్‌ బొమ్మపై గెలిచాను.. ఇప్పుడు సంతనూలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఉన్నానని తెలిపారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదు.. అందరూ మా వాళ్లే.. అందరూ సీఎం వైయ‌స్‌ జగన్‌ కోసం పనిచేస్తారని మంత్రి మేరుగు నాగార్జున స్ప‌ష్టం చేశారు.

ALSO READ: వారికే ఎమ్మెల్యే టికెట్.. సీఎం జగన్ సంచలన నిర్ణయం

Advertisment
తాజా కథనాలు