ఈమధ్యకాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. మొన్న హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై వేటు వేసింది కాలేజీ యాజమాన్యం. ఇప్పుడు వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కాలేజీ వార్తల్లో నిలిచింది. కొంతమంది విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పూర్తిగా చదవండి..Warangal: కాకతీయ మెడికల్ కాలేజీలో పొట్టుపొట్టు కొట్టుకున్న విద్యార్థులు..ఒకరికి గాయాలు..!!
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన ఈనెల 14వ తేదీని జరిగింది. ఈ గొడవలో ఒకర విద్యార్థికి గాయాలయ్యాయి. దీంతో ఈ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Translate this News: