ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటును పుట్టిస్తున్నాయి. వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు వైసీపీ కూడా ఎలాగైనా ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే మాటలకు పదును పెడుతున్నారు. దీంతో మాటల యుద్ధం కొనసాగుతోంది. యువగళం పాదయాత్ర పేరుతో ముందుకెళ్తున్నా లోకేష్.. ఆదివారం వినుకొండలో పర్యటించారు. ఈక్రమంలో స్థానిక ప్రజలు సమస్యలను తెలుసుకోవడంతో పాటు.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బొల్లా తీవ్రంగా స్పందించారు.
పూర్తిగా చదవండి..దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు.. లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్!
ప్రజలకు తాగు నీరు పేరుతో కోట్ల రూపాయలు ట్యాంకర్లకు ఖర్చు పెట్టామని అబద్దాలు చెబుతోన్న లోకేష్.. దొచుకున్న లెక్కల వివరాలను బయట పెట్టాలన్నారు ఎమ్మెల్యే బొల్లా. అడ్డదారిలో ముఖ్యమంత్రిగా, మంత్రిగా అవతరించిన చంద్రబాబు, లోకేష్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిని రాజధానిని చేస్తానని చెప్పి గ్రాఫిక్స్ చూపించారని.. కానీ చివరికి చేతులెత్తేశారని విమర్శించారు. వినుకొండ ప్రజలకు తాగునీరు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఎమ్మెల్యే నిలదీశారు..
Translate this News: