vijayawada: పిచోడికి పెళ్లి కుదిరింది. మళ్ళీ మళ్ళీ పెళ్లి: మంత్రి జోగి రమేష్

చంద్రబాబుతో ములాఖత్‌కి వెళ్లి మిలకత్ అయ్యాడు. తాడు బొంగరం లేని వాళ్ళతో మీటింగ్ పెట్టి పిచ్చోడు మాట్లాడాడు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలను అడిగితే జగన్ స్థాయి చెపుతారు. మేధావులు, విద్యార్థులు, గౌరవ ప్రదమైన వాళ్ళు అంతా జగన్ స్థాయి చెపుతారు.

New Update
vijayawada: పిచోడికి పెళ్లి కుదిరింది. మళ్ళీ మళ్ళీ పెళ్లి: మంత్రి జోగి రమేష్

నువ్వు పిచోడిలా మాట్లాడుతున్నావ్

చంద్రబాబుతో ములాఖత్‌కి వెళ్లి మిలకత్ అయ్యాడు. తాడు బొంగరం లేని వాళ్ళతో మీటింగ్ పెట్టి పిచ్చోడు మాట్లాడాడు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలను అడిగితే జగన్ స్థాయి చెపుతారు. మేధావులు, విద్యార్థులు, గౌరవ ప్రదమైన వాళ్ళు అంతా జగన్ స్థాయి చెపుతారు. ముందు నీ బ్రతుకు, నీ కెపాసిటీ ఏంటో చెప్పు పవన్.. అని ప్రశ్నించారు. చంద్రబాబు పెంపుడు కుక్క పవన్ అని జోగి రమేష్ ఆరోపించారు. కడపలో 5 లక్షలపైనే మెజారిటీతో జగన్ గెలుపొందుతారని దీమా వ్యక్తం చేశారు. 175 స్థానాలకు 151 స్థానాలు, 25 పార్లమెంట్‌లో 22 పార్లమెంట్ స్థానాలు గెలిపించాడు.. అది జగన్ స్థాయి అంటూ ఘటుగా స్పందించారు మంత్రి జోగి రమేష్‌. యువరాజ్యం నుంచి బయటకి వొచ్చావ్..!! జనసేనని హోల్ సెల్‌గా అమ్మేసిన నువ్వు పిచోడిలా మాట్లాడుతున్నావ్ అని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం, సామాజిక ధర్మం చూసి మిగిలిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిలు ఫాలో అవుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

నీ నోటిని సరిచేసుకోవాలి

విఠలాచార్య సినిమా అనుకొన్నవా..? సింహాసనము కూల్చేస్తా అంటున్నావు.. ఏదేమైనా అట్టముక్కనా.. అంటూ కితము పలికారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి పరుడవని, ప్రజాధనం లూటీ చేశావని మాట్లాడింది నువ్వు కదా..? అని ప్రశ్నించారు. విలువ , విశ్వసనీయత, సిద్ధాంతం లేని పార్టీ జనసేన అని ఘాట్‌ వ్యాఖ్యలు చేశారు. రెండు చోట్లా మట్టికొట్టుకుపోయిన నువ్వా..! జగన్ కోసం మాట్లాడేది అంటూ మండి పడ్డారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో.. పిచ్చి కుక్కలాగా, పిచ్చి పట్టినట్లు మాట్లాడితే బట్టలుదా దీసి కొడతాం అంటూ వ్యాఖ్యానించారు. పొత్తు పెట్టుకో.. సీట్లు తీసుకో కానీ అదుపు తప్పి మాట్లాడితే మాత్రం ప్రజలే చెమడాలు వలుస్తారు అన్నారు. ఒక్కడై, ఒక్క అడుగుతో మొదలు పెట్టి దేశం గర్వించే నాయకుడిగా జగన్ ఎదిగాడు. నీ నోటిని సరిచేసుకోవాలి.. లేదంటే తగిన శాస్తి చేస్తామన్నారు.

పవన్ కళ్యాణ్ మానసిక స్థితి బాగోలేదు

మానసిక స్థితి బాగోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్.. ఎవరితో పొత్తు పెట్టుకొంటాడో తెలీదు.. ఎవరిని పెళ్లి చేసుకొంటాడో తెలీదు.. ఎవరితో వ్యభిచారం చేస్తాడో తెలీదన్నారు. పవన్ మానసిక స్థితి గురించి వాళ్ళ కుటుంబ సభ్యులను అడగాలి.. పెళ్లి చేసుకొని వొదిలేసిన ఆ చెల్లిని అడిగితే చెపుతుందన్నారు. జగన్‌ని నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పిన చంద్రబాబు జైలులో ఊసలు లెక్కపెడుతున్నాడని విమర్శలు చేశారు. స్కీల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు , లోకేష్‌తో పాటు పవన్ కళ్యాణ్‌కి కూడా వాటా ఉందని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు