BREAKING: కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

BREAKING: కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
New Update

Vijaya Shanthi Joined In Congress: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న విజయశాంతి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మల్లిఖార్జున ఖర్గే. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

ALSO READ: లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు.. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం విజయశాంతి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని తెలిపారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేయాలని కాంగ్రెస్‌ పార్టీలో తాను చేరినట్లు వెల్లడించారు.

ALSO READ: ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు..

#telangana-elections-2023 #telangana-news #vijayashanthi-joined-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe