Champion Trophy: సెమీ ఫైనల్స్.. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌ మొదలైంది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఏ టీం గెలిస్తే అది ఫైనల్స్‌కు వెళ్తుంది. ఓడిపోయిన టీమ్‌కు ఇక ఇంటికే. 

author-image
By B Aravind
New Update
India VS Australia

India VS Australia

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌ మొదలైంది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. మాజీ క్రికెటర్ పద్మాకర్ శివాల్కర్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లను ధరించారు. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, షమీ, కుల్‌దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి టీమ్‌లో ఉన్నారు. 

Also Read: కోహ్లీని ఊరిస్తున్న రికార్డు.. 139 పరుగులు చేస్తే.. !

ఆస్ట్రేలియా జట్టులో కూపర్ కొన్నెల్లీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా ఉన్నారు. అయితే ఈ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో ఏ టీం గెలిస్తే అది ఫైనల్స్‌కు వెళ్తుంది. ఓడిపోయిన టీమ్‌కు ఇక ఇంటికే. 

Also Read: రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు!

Advertisment
తాజా కథనాలు