/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WPL-1-jpg.webp)
WPL: మహిళల ప్రీమియర్ లీగ్ గుజరాత్ కు కలిసిరావడం లేదు. శుక్రవారంజరిగిన గ్రూప్ దశ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయింది. 142 పరుగులు మాత్రమే చేసింది. ఆష్ లైగ్ గార్డనర్ 30, ఫోబే లిచ్ ఫీల్డ్ 35 , లారా వోల్వార్డ్ 28 పరుగులు చేయగా..యూపీ బౌలర్లలో సోఫీ ఎలకెల్ స్టోన్ 3, రాజేశ్వరి గైక్వాడ్ 1 వికెట్ తీసుకున్నారు.
గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని యూపీ వారియర్స్ మరో 26 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఓపెనర్ ఆల్యేశా హేలీ 33 పరుగులు చేసి బ్రైస్ బౌలింగ్ లో బౌల్డ్ అయి పెవిలియన్ కు చేరింది. మరో ఓపెనర్ కిరణ్ నావ్ గిర్ 12, చామారి ఆటపట్టు 17 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గ్రేస్ హారిస్ 60 పరుగులు చేయగా..గుజరాత్ బౌలర్లు తనూజా కన్వర్ రెండు క్యాత్రిన్ బ్రైస్, మేఘనా సింగ్ ఒక్కో వికెట్ తీశారు.
No cricket fans will scroll down without liking this video❤️
Our 2nd consecutive victory🤩🤩#UPWvGGW #WPL2024 #UPWvGG pic.twitter.com/iBNHA8Pi3E
— UP Warriorz #UPW (@UPWarriorzWPL) March 1, 2024