Telangana: గొనెసంచిలో మృతదేహం కలకలం.. ఓఆర్‌ఆర్‌ పైనుంచి కిందపడేసిన దుండగులు

రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లీ ఓఆర్‌ఆర్‌ వద్ద సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గొనెసంచిలో మూటగట్టి ఉన్న ఆ మృతదేహాన్ని ఓఆర్‌ఆర్‌ పైనుంచి దుండగులు కిందపడేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Telangana: గొనెసంచిలో మృతదేహం కలకలం.. ఓఆర్‌ఆర్‌ పైనుంచి కిందపడేసిన దుండగులు
New Update

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని బ్రాహ్మణపల్లీ ఔటర్ రింగురోడ్డు సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. గొనెసంచిలో మృతదేహాన్ని మూటగడ్డి ఓఆర్‌ఆర్‌ పైనుంచి గుర్తు తెలియని వ్యక్తులు కింద పడేశారు. అయితే ఆ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో ఆ గోనెసంచి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అది ఎవరి మృతదేహం, ఎవరు చంపి అలా పడేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ సక్సెస్‌!? దావోస్​ పర్యటనలో రేవంత్​ బిజీబిజీ!

#telugu-news #deadbody #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe