Union Minister Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రైతులకు వెన్ను పోటు పొడుస్తోందన్నారు. రైతుకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్(CM KCR) ప్రభుత్వం.. ఇప్పుడు రైతులను నిండా ముంచిందని అన్నారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా బొంగళూరులో భారతీయ జనతా కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) ఆధ్వర్యంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కిసాన్ సమ్మేళనం కార్యక్రమంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కిషన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నాలుగున్నరేళ్లుగా రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన రూ. లక్ష రుణ మాఫీ కేవలం వడ్డీలకే సరిపోతుందన్నారు. లక్షలాది మంది రైతులను రుణ మాఫీ పేరుతో మోసం చేశారని అన్నారు. రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పి.. అలా కూడా రైతులను కేసీఆర్ మోగించారని విమర్శించారు కేంద్ర మంత్రి.
పూర్తిగా చదవండి..Union Minister Kishan Reddy: రైతులను నిండా ముంచిన కేసీఆర్.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు వెన్ను పోటు పొడుస్తోందన్నారు. రైతుకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతులను నిండా ముంచిందని అన్నారు.
Translate this News: