Crime:సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టే ఇవ్వలేదని మైనర్లు ఘాతుకం..!

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని ఇద్దరు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. అగ్గిపెట్టే ఇవ్వలేదని కోపంతో రగిలిపోయిన మైనర్లు ఓ యువకుడిని కత్తితోపొడిచి చంపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!

Crime: దేశ రాజధాని ఢిల్లీలో రోజుకో హత్య కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటిది ఓ చిన్న విషయానికి కత్తితో పొడిచి చంపిన ఉదంతం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఉత్తర ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో సిగరెట్ కాల్చేందుకు అగ్గిపుల్లలు ఇవ్వలేదని ఇద్దరు యువకులు ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన ఉత్తర ఢిల్లీలోని తిమర్‌పూర్‌లో చోటుచేసుకుంది. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం తిమార్ పూర్ పోలీస్ స్టేషన్ పీసీఆర్ ఫోన్ కాల్ వచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో రక్తం మడుగులో పడి ఉన్న యువకుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయడంతోపాటు ఘటనాస్థలంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులిద్దరూ టీనేజర్లేనని పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులు ఉపయోగించిన ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామని..నిందితులను ప్రశ్నిస్తే..సిగిరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టే ఇవ్వలేదని దీంతో గొడవ జరిగినట్లు చెప్పారు. కోపంతో ఒకడు కత్తితో పొడిచాడని..ఇద్దరు అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకడు గతంలో తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా?: సజ్జలపై షర్మిల సంచలన కామెంట్స్

Advertisment
తాజా కథనాలు