Heavy Rains: ఖమ్మంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన దంపతులు

భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్ని నీటమనిగాయి. కుసుమంచి మండలం నాయకన్‌గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంతయ్యారు.

New Update
Heavy Rains: ఖమ్మంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన దంపతులు

భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలమయ్యింది. లోతట్టు ప్రాంతాలన్నీ నిటమునిగాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే కుసుమంచి మండలం నాయకన్‌గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న మరో యువకుడిని స్థానికులు, పోలీసులు కాపాడారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాలేరు అలుగు సమీపంలో ఉన్న సిమెంటు ఇటుకల తయారీ ఫ్యాక్టరీలో ఓ కుటుంబం ఉంటోంది.

Also Read: నీటమునిగిన ఖమ్మం.. మున్నేరు వాగు మహోగ్రరూపం

పాలేరు జలశాయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచి వరద పోటేత్తింది. దీంతో షేక్ యాకుబ్, అతని భార్య సైదాబి, కొడుకు షరీఫ్‌ వరదల్లో చిక్కుకుపోయారు. వరద ఉద్ధృతి పెరగడంతో ప్రవాహంలో దంపతులు గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న షరీఫ్‌ను స్థానికులు, పోలీసులు రక్షించారు. దంపతుల ఆచూకి కోసం సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.

Advertisment
తాజా కథనాలు