USA: అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరు దుర్మరణం

అమెరికాలో టెక్సాస్‌లో రెండు గ్రూపు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి రౌండ్‌ రాక్‌లోని పార్కులో జరిగిన ఓ ఈవెంట్‌కు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరో ఆరుగురు తీవ్రంగా గాయలపాలయ్యారు. వీళ్లలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

New Update
USA: అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరు దుర్మరణం

అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. టెక్సాస్‌లో రెండు గ్రూపు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి రౌండ్‌ రాక్‌లోని పార్కులో ఓ ఈవెంట్ జరిగింది. ఎక్కువమంది ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే దీనికి సమీపంలో రెండు గ్రూపుల మధ్య వివాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పాయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయలపాలయ్యారు. వీళ్లలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

Also Read: అవినీతికి అడ్డాగా ఆ పోలీస్ స్టేషన్.. ఒకే సారి 12 మంది సీఐలు, నలుగురు ఎస్ఐలు ఔట్!

సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితులు అక్కడినుంచి పారిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: ఢిల్లీలో నీటి సంక్షోభం.. అల్లాడిపోతున్న నగర ప్రజలు

Advertisment
తాజా కథనాలు