Telangana: బస్సులో మహిళపై అత్యాచార ఘటన.. ఇద్దరు అరెస్టు

తెలంగాణలోని నిర్మల్‌ నుంచి ఏపీకి వెళ్తున్న బస్సుల్లో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు బస్సు డ్రైవర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు ఈ అఘాయిత్యానికి పాల్పడగా..మరొకరు సహకరించినట్లు పేర్కొన్నారు.

New Update
Telangana: బస్సులో మహిళపై అత్యాచార ఘటన.. ఇద్దరు అరెస్టు

తెలంగాణలో నిర్మల్‌ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సలో మహిళపై అత్యాచారం జరిగిందనే సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నోట్లో గుడ్డలు కుక్కి బస్సు డ్రైవర్ అత్యాచారం చేశాడని బాధితురాలు అర్ధరాత్రి 1.00 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఓయూ పీఎస్‌ సమీపంలోని బస్సును ఆపి సీజ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియాకు వివరించారు.

Also read: నూతన గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

' బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరికృష్ణ ట్రావెల్స్‌కు సంబంధించి నెల్లూరుకు చెందిన ఈర్ల కృష్ణ బాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నాం. చేగుంటలో భోజనం చేశాక సిద్ధయ్య బస్సును నడిపాడు. దీంతో కృష్ణబాబు.. బాధితురాలితో మాటలు కలిపి ఈ ఆఘాయిత్యం చేశాడు. ఇందుకు సిద్ధయ్య అతడికి సహకరించాడు. నిందితులపై కేసు నమోదు చేసి.. మంగళవారం యాచరం స్టేషన్‌ పరిధిలో నిందితులను అరెస్టు చేశాం. ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. మరోవైపు బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితమే మరణించాడని' బాలస్వామి తెలిపారు.

Also read: సబితక్క నన్ను మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు