AP : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి!

ఏపీలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . టాటా ఏస్‌ వ్యాన్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రగా గాయపడ్డారు.

New Update
AP : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి!

Akkireddypalem : ఏపీ(AP) లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది . టాటా ఏస్‌ వ్యాన్(Tata Ace Van) ను లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రగా గాయపడ్డారు. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. క్షతగాత్రులను కేజిహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెందుర్తి పోలీసులు

మరో ఘటనలో ఇద్దరు..

ఆంధ్రా సరిహద్దు నుండి విజయవాడ(Vijayawada) కూలి పని కోసం వలస వెళుతున్న బొలెరో వాహనం పాడేరు ఘాట్లో బోల్తాపడి ఇద్దరు మృతి చెందాగా మరో 26 మందికి తీవ్ర గాయాలాయ్యాయి . ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బాడెంవలస గ్రామానికి చెందిన 27 మంది జొన్నలు ఏరడం కోసం గన్నవరం బయలుదేరారు. పాడేరు ఘాట్లో ఏసు ప్రభువు మలుపు సమీపంలో బొలెరో అదుపు తప్పు ఎడమవైపు లోయలోకి దూసుకుపోయింది.
ఈఘటనలో 17 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా, పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు.

Also read: మళ్లీ దొరికిపోయిన విజయ్‌-రష్మిక.. ఇదిగో ప్రూఫ్‌!

Advertisment
తాజా కథనాలు