Telangana: తెలంగాణలో ఇవాళ ఎంసెట్ తేదీ ప్రకటన.. !

తెలంగాణలో ఎంసెట్‌తో పాటు ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను గురువారం లేదా శుక్రవారాల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. ఎంసెట్‌ పేరు మార్పుపై జీవో జారీ అయితే గురువారం సాయంత్రం లేదా శుక్రవారం పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

New Update
TS PECET: టీఎస్ పీఈసెట్-2024 షెడ్యూల్ విడుద‌ల‌..

Telangana: రాష్ట్రంలో ఎంసెట్‌తో పాటు మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను గురువారం లేదా శుక్రవారాల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌ పేరు మార్పుపై జీవో జారీ కావాల్సింది ఉంది. ఇది జరిగితే గురువారం సాయంత్రం లేదు శుక్రవారం పరీక్షల తేదీలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన కాలపట్టికకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

Also Read: ‘రెరా’ కార్యదర్శి బాలకృష్ణ అరెస్టు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు

మే నెల రెండో వారంలో ఎంసెంట్ పరీక్ష ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే పీఈసెట్, పీజీఈసెట్‌లు మాత్రం మే చివరి నుంచి జూన్‌ తొలివారంలో జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎంతో పాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ఎంసెట్‌తో సహా.. ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్‌ల తేదీలను ప్రకటిస్తారు.

Also Read: 5 ఏళ్ల చిన్నారిని చంపేసిన మూఢ నమ్మకం.. కన్నకొడుకుకే నీటిలో ముంచి హతమర్చిన తల్లిదండ్రులు!

ఈసెట్‌ను మాత్రం మే మొదటి వారంలోనే నిర్వహించనున్నారు. మరోవైపు పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌కు సంబంధించి ఈసారి పరీక్ష విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని.. నిపుణుల కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సిఫార్సు చేసింది.

;

Advertisment
తాజా కథనాలు