TS TET : మే 20 న తెలంగాణ టెట్‌... పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే!

మే 20 న తెలంగాణ వ్యాప్తంగా జరిగే టెట్ పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. తొలిసారి కంప్యూటర్‌ ఆధారిత టెట్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష సమయంలో పాటించాల్సిన నిబంధనలను అధికారులు తెలియజేశారు. అవేంటో మీరు కూడా ఈ కథనంలో చదివేయండి.

TS TET : మే 20 న తెలంగాణ టెట్‌... పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే!
New Update

Telangana : మే 20 నుంచి జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) 2024 కు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు కేంద్రాల్లోకి అనుమతించరు. ఉదయం సెషన్ పరీక్ష కోసం, అభ్యర్థులను ఉదయం 7.30 నుండి సెంటర్‌లలోకి అనుమతిస్తారు, 8.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారు.

మధ్యాహ్నం సెషన్‌కు, అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి లోపలికి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రం గేట్ మధ్యాహ్నం 1.45 గంటలకు మూసివేస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులను బయటకు వెళ్లనివ్వరు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా కంప్యూటర్‌ ఆధారితంగా టెట్‌ను నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు, ఇది OMR ఆధారిత ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించడం జరిగింది.

అభ్యర్థులు బయోమెట్రిక్ సమాచారాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, గోరింటాకు, ఇంక్ వంటి బయటి మెటీరియల్‌లను అనుమతించమని అధికారులు వివరించారు. అడ్మిట్ కార్డ్‌తో పాటు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ లేదా ఓటర్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా కేంద్రాలకు తీసుకుని వెళ్లాలని అధికారులు తెలిపారు.

ఈ సారి టెట్‌కు మొత్తం 2,86,386 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం, 99,958 రిజిస్ట్రేషన్‌లు పేపర్ – I, I నుండి V తరగతులకు బోధనా అర్హతను కోరుకునే అభ్యర్థుల కోసం నిర్వహించనున్నారు. మిగిలిన 1,86,428 దరఖాస్తులు VI నుండి VIII తరగతుల ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం జరిగిన పేపర్ – II కోసం జరిగాయి.

Also read: సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య!

#telangana #rules #ts-tet-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe