Accident: భద్రాద్రి కొత్తగూడెంలో పొలాల్లోకి దూసుకెళ్లిన పల్లెవెలుగు బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

Accident: భద్రాద్రి కొత్తగూడెంలో పొలాల్లోకి దూసుకెళ్లిన పల్లెవెలుగు బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
New Update

TS Rtc Bus Accident: భద్రాధ్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పట్టినగర్ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి కారణం డ్రైవర్ అతివేగంతో పల్లెవెలుగు బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిందంటున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వివరాల్లో వెళ్తే.. అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యంలో ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరంచారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఈ ఆకుల్లో విటమిన్లు మెండు.. ప్రొటీన్‌ లోపాన్ని తొలగించే సంజీవని

#road-accident #bhadradri-kothagudem
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe