Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని బలవన్మరణం..!!

బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శిరీష స్వగ్రామం సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దేవురాపురం.

New Update
TS News : అయ్యో వైశాలి.. మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత పని చేశావమ్మా!

Basara IIIT Incident :  బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) లో విషాదం నెలకొంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శిరీష(Sirisha) బలవర్మణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్య(Suicide) కు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శిరీష బుధవారమే తన ఇంటి నుంచి ఆర్జీయూకేటీ క్యాంపస్(RGUKT Campus) కు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇంతలోనే ఆమె సూసైడ్ చేసుకోవడం విషాదకరంగా మారింది. విద్యార్థిని గదిలో సూసైడ్ నోట్(Suicide Note) కూడా లభించిందని అధికారులు తెలిపారు. శిరీష స్వగ్రామం సంగారెడ్డి జిల్లా(Sangareddy District) మనూర్ మండలం దేవురాపురమని హాస్టల్ వార్డెన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : భార్యే భర్తకు భరణం ఇవ్వాలి..కోర్టు సంచలన తీర్పు..!!

Advertisment
తాజా కథనాలు