Crime: వివాహితతో సహజీవనం.. పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన దుర్మార్గుడు!
వివాహితతో సహజీవనం చేస్తున్న ఓ దుర్మార్గుడు ఆమె పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా భావించిన ప్రదీప్ మద్యం మత్తులో ఏడాదిన్నర బాలుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.