Tirupat: బాలుడి కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ

తిరుపతి బస్టాండ్‌లోకిడ్నాప్‌ అయిన బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని నిందితుడు సుధాకర్ తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. సుధాకర్‌ చిన్నారిని ఏర్పేడులోని తన అక్క ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు ఏర్పేడులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడి నుంచి బాలుడ్ని తీసుకొని ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడకు చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చిన్నారిని అప్పగించారు.

Tirupat: బాలుడి కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ
New Update

తిరుపతి బస్టాండ్‌లోకిడ్నాప్‌ అయిన బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని నిందితుడు సుధాకర్ తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. సుధాకర్‌ చిన్నారిని ఏర్పేడులోని తన అక్క ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు ఏర్పేడులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడి నుంచి బాలుడ్ని తీసుకొని ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడకు చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చిన్నారిని అప్పగించారు. కాగా బాలుడు కిడ్నాప్‌ అయిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేధించడంతో జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని అభినందించారు.


బాలుడ్ని ఎత్తుకెళ్లిన వ్యక్తి సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ.. నిందితుడిపై గతంలో ఎలాంటి కేసులు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల చేతులను ఎట్టి పరిస్ధితుల్లో వదిలకూడదని, రాత్రి సమయంలో అనుమానాస్పదంగా ఎవరైనా కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి సూచించారు.

తిరుమతి ఆర్టీసీ బస్టాండ్‌లో అర్థరాత్రి రెండేళ్ల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన నిన్న రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన చంద్రశేఖర్-మీనా దంపతులు తమ రెండో కుమారుడు మురుగేశన్‌ తో కలిసి వచ్చారు. అయితే.. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో ఆ బాలుగు కిడ్నాప్ కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ వయస్సు సుమారు32 సంవత్సరాలు ఉండవచ్చు అని పోలీసులు వెల్లడించారు. కిడ్నాపర్ వైట్ షూ, గ్రీన్ కలర్ షర్ట్‌తో వేసుకుని ఉన్నాడని తెలిపారు. రిజర్వేషన్ కౌంటర్ నుంచి బాలుడ్ని బస్టాండ్ బయట గల అంబేద్కర్ విగ్రహం వైపు ఆ కిడ్నాపర్ తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు వివరాల ప్రకారం.. వరుస సెలవుల నేపథ్యంలో చెన్నైకి చెందిన ఒక కుటుంబం మూడు రోజుల క్రితం తిరుమలకు వచ్చింది. స్వామి వారి దర్శనం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లడానికి సిద్ధం అవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో తిరుపతి బస్‌స్టాప్‌లో చెన్నై బస్ కోసం ఎదురుచూస్తుండగా బాలుడి కిడ్నాప్ జరిగింది. అప్పటివరకు కూడా పిల్లోడిని ఎంతో జాగ్రత్తగా తండ్రి చూసుకున్నట్లుగా కూడా సీసీ టీవీ ఫుటేజ్ లో స్పష్టం అవుతోంది. అదే సమయంలో పిల్లోడికి ఆకలిగా ఉంటే.. కొన్ని తినుబండారాలు, పాలు అలాంటివి కొనేందుకు తండ్రి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పిల్లలకి కావలసిన కొనిచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి అక్కడే కొద్దిసేపు బస్ కోసం ఎదరు చూశారు. బస్సు రాకపోవటంతో కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా కాసేపు పడుకున్నారు. తల్లిదండ్రులు నిద్రపోతున్నది చూసి.. ఇంతలో బస్టాండ్ ఆవరణంలో తిరుగుతున్న దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. 2 గంటల సమయంలో బాబుని కిడ్నాప్ చేశారు. బాబు ఎత్తుకెళ్ళిన ఇద్దరూ అనుమానితులను పోలీసులు గుర్తించారు.

#case #tirupati #sp #parameshwar-reddy #boy-kidnapping
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి