Breaking : ఎన్నికల ముహుర్తం ఫిక్స్...ఎలక్షన్ డేట్ ఎప్పుడంటే?

ఐదు రాష్ట్రాల పరిశీలకులతో ఎన్నికల సంఘం ఈ రోజు ఢిల్లీలో సమావేశం కానుంది.  త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ  ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.

New Update
Elections 2023:  ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఆ రాష్ట్రాల్లో సీట్ల లెక్కలివే..!!

5 State Assembly Elections : ఐదు రాష్ట్రాల పరిశీలకులతో ఎన్నికల సంఘం సమావేశమవుతోంది. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ (Election Commission)  ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణలో (Telangana Assembly Elections) ఒక్కో దశలో ఓటింగ్ జరగనుంది. 5 రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత ఎన్నికల సంఘం ఈ ప్రణాళికను రెడీ చేసింది. నవంబర్‌లో ఎన్నికలు..డిసెంబర్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలో ఈసీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇది కూడా చదవండి: Breaking News: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నుంచి నామినేషన్లు.. ముఖ్యమైన తేదీలివే!

కాగా డిసెంబర్ 15వ తేదీ లోపు ఈ రాష్ట్రాలన్నింటిలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ఆమోదం తెలిపిన తర్వాత ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఇవాళ జరిగే పరిశీలకుల సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పలు వార్త ఏజెన్సీల ప్రకారం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీ భిన్నంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓట్ల లెక్కింపు మాత్రం ఏకకాలంలో జరగునున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్…మరింత తగ్గిన బంగారం ధరలు..కొనేందుకు మంచి ఛాన్స్..!!

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), తెలంగాణ (Telangana), మిజోరాం (Mizoram), రాజస్థాన్‌ (Rajasthan)లలో నవంబర్-డిసెంబర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మిజోరాం అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగియనుంది. ఈశాన్య రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలున్నాయి.

Advertisment
తాజా కథనాలు