Allu Arjun Jr. NTR : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన డ్యాన్స్ , నటన, బాడీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తండ్రి జాకీ ష్రాఫ్(Jackie Shroff) వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా టైగర్ సౌత్ ఇండియా స్టార్ , మలయాళ నటుడు పృథ్వీరాజ్ తో కలిసి ఓ సినిమాలో నటించాడు.
దాని ప్రమోషన్స్ లో పాల్గొన్న టైగర్ ను మీడియా సౌత్ నుంచి ఇంకా ఏ హీరోతో అయినా నటించాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. టైగర్ చెప్పిన సమాధానం విని తెలుగు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే టైగర్ చెప్పినవి మామూలు పేర్లు కాదు మరీ.
తెలుగు సినీ పరిశ్రమలో '' అల్లు అర్జున్(Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) లకు నేను వీరాభిమానిని. వారిద్దరితో కలిసి ఏదోక రోజూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లు... ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు టైగర్ తెలిపాడు. దీంతో అటు నందమూరి ఫ్యాన్స్.. మెగా ఫ్యాన్స్ ఈ కామెంట్లను సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరల్ చేస్తున్నారు.
టైగర్ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు గడిచిన సందర్భంగా టైగర్ మరికొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. నా మొదటి చిత్రం హీరోపంతి.. అందులో నా పాత్ర పూర్తిగా యాక్షన్ ఎలివేషన్స్ తో ఉంది. ఆ తరువాత నుంచి కూడా నేను అన్ని యాక్షన్ మూవీస్(Action Movies) నే చేస్తున్నాను. కేవలం యాక్షన్ సినిమాలే చేయడానికి ఓ కారణం ఉందని టైగర్ తెలిపాడు.
'' ఇండస్ట్రీ అంటే ఎంతో పోటీతో కూడుకున్నది. మనకి టాలెంట్ ఉన్నప్పటికీ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ సమయంలో నాకు యాక్షన్ హీరో అని ప్రేక్షకులు ఇచ్చిన ట్యాగే ఓ గుర్తింపు.'' అంటూ టైగర్ చెప్పుకొచ్చాడు. నాకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఎన్నో కలలు కనేవాడిని.. నేను ఓ ప్రేక్షకుడిలా ఎందరో హీరోలను చూస్తూ పెరిగాను. వారిలాగే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాను. మొత్తానికి నా కలలు నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని టైగర్ వివరించాడు.
Also Read : ఎంపీ అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచిన ఎలక్షన్ కమిషన్!