/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Drowning-jpg.webp)
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని గోపులంక గోదావరిలో నిన్న విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు గల్లంతవ్వడం కలకలం రేపింది. అయితే ఈ ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్లో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు, ఓ మహిళా ఉన్నారు. అయితే వీళ్లందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం ఆందోళన కలిగిస్తోంది. వీళ్లలో సావిత్రి, అనుపోజు రఘువర్మ, అనుపోజు వసంత్లు మృతి చెందినట్లుగా గుర్తించారు. అలాగే మరో ఇద్దరి యువతుల పరిస్థితి విషయమంగా ఉంది. ప్రస్తుతం వాళ్లిద్దర్ని మెరుగైన వైద్యం కోసం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.