Andhra Pradesh: ఏపీలో మరో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతు..
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని గోదావరిలో నలుగురు యువకులు గల్లంతైన ఘటన మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. వీళ్లలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు, ఓ మహిళా ఉన్నారు. సావిత్రి, అనుపోజు రఘువర్మ, అనుపోజు వసంత్లు మృతిచెందినట్లుగా గుర్తించారు. మరో ఇద్దరు యువతుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీళ్లిద్దరినీ మెరుగైన వైద్యం కోసం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.