కాంగ్రెస్ బ్రోకర్ మాటలను నమ్మొద్దు. వాళ్లు డబ్బు సంచులతో వచ్చి ఉపన్యాసాలు దంచిపోతారు. ప్రజలకు మొండి చేయి చూపిస్తారు. ఎప్పటికైనా తెలంగాణకు సీఎం కేసీఆర్ పరిపాలనే శ్రీరామరక్ష. సార్ను నమ్ముకుంటే మనం చల్లంగా ఉంటాము. ప్రజలు అప్రమత్తంగా ఉంది మరోసారి సీఎం కేసీఆర్కు అవకాశం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ దుష్ట పరిపాలన వలె తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. దేశాన్ని ఏకధాటిగా 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వాళ్లు ఇవ్వాళ సీఎం కేసీఆర్ అందిస్తున్న దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, పెన్షన్లు, కేసీఆర్ కిట్లు వంటి పథకాలను అమలు చేశారా..? అని ఆయన ప్రశ్నించారు. వాళ్లు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నారా..? అక్కడ ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో అలవి గాని హామీలు ఇస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. జనాలకి ఇచ్చేది లేదు అన్నారు. అలాంటి వాళ్ళను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే నని చెప్పారు.
పూర్తిగా చదవండి..Telangana Politics: బీఆర్ఎస్లోకి రాజేందర్…యాదవుల్లో కొత్త జోష్
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో ప్రముఖ రియాల్టర్ బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈరోజు తొర్రూరులో భారీగా నిర్వహించిన యాదవ సింహ గర్జన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
Translate this News: