• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

Mahua Moitra: మహువా లోక్‌సభ ఖాతాను ఆ దేశం నుంచి 47 సార్లు వినియోగించారు: దూబే

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటరీ ఖాతాను దుబాయ్‌ నుంచి దాదాపు 47 సార్లు వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే మరోసారి ఆరోపణలు చేశారు. ఇవి నిజమని తేలితే ఎంపీలందరూ ఆమె అవినీతిని వ్యతిరేకించాలని కోరారు.

author-image
By B Aravind 01 Nov 2023 in Latest News In Telugu నేషనల్
New Update
Mahua Moitra : మహువా ఇంటికి వెళ్లిన అధికారులు.. చివరికి
Follow Us

డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. అయితే ఈ కేసులో మరిన్ని బయటపడుతున్నాయి. ఆమె పార్లమెంటరీ ఖాతాను దుబాయ్‌ నుంచి దాదాపు 47 సార్లు వినియోగించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ విషయాన్ని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే మహువా మొయిత్రా గురువారం లోక్‌సభ నైతిక కమిటీ విచారణను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించి బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ఎక్స్‌( ట్విట్టర్ ) వేదికగా స్పందించారు. దుబాయ్‌లోని వ్యాపారవేత్త హీరానందానికి చెందిన ప్రదేశాల నుంచి మహువా లోక్‌సభ ఖాతాలోకి 47 సార్లు లాగిన్‌ అయినట్లు, అక్కడి నుంచే పలు ప్రశ్నలు అడిగినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయని తెలిపారు. ఈ వార్తలు వాస్తవమని తేలితే.. దేశవ్యాప్తంగా ఎంపీలందరు ఆమె అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని.. హీరానందని స్వప్రయోజనాల కోసం ఆయనే ఈ ప్రశ్నలు అడిగారని రుజువైనట్లేనని పేర్కొన్నారు. పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం మనం ఎంపీలుగా పనిచేస్తున్నామా అంటూ మండిపడ్డారు నిషికాంత్ దూబే.

Also read: కేటీఆర్‌, రేవంత్ రెడ్డి ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరిక.. బీజేపీ నేతలు ఏమన్నారంటే

ఇదిలా ఉండగా.. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని.. పార్లమెంటరీ లాగిన్‌ వివరాలను హీరానందానికి ఇచ్చినట్లు నిషికాంత్ దూబే ఇటీవల ఆరోపించారు . మరోవైపు హీరానందాని కూడా మహువాకు లంచం ఇచ్చానని అంగీకరించినట్లుగా ఆయన పేరుతో ఓ అఫిడవిట్‌ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆరోపణలను మహువా ఖండించారు. హీరానందానికి తన లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ ఇచ్చిన మాట వాస్తవమేనని.. కానీ, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని, ప్రశ్నలన్నీ తానే అడిగినట్లు పేర్కొన్నారు. అలాగే హీరానందానితో కేంద్రం బలవంతంగా ఆ అఫిడవిట్‌పై సంతకం చేయించినట్లు మహువా ఆరోపించారు. అయితే మహువాపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ.. ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె గురువారం హాజరుకానున్నారు. అలాగే తనకు లంచం ఇచ్చానని హీరానందాని అంగీకరించినట్లుగా ఉన్న అఫిడవిట్‌పై ఆయనను కూడా ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని మహువా ఎథిక్స్‌ కమిటీని అభ్యర్థించారు.

#national-news #telugu-news #mahua-moitra
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by