Kawal Tiger Reserve: కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ (Nirmal) జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ఇదే మండలంలోని ధర్మాజిపేటకు ప్రజలను తరలించనున్నారు. ధర్మాజిపేటలోనే వారికి పునరావాసం కల్పించనుండగా.. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. అలాగే మైసంపేట, రాంపూర్ వాసుల్ని రాష్ట్ర ప్రభుత్వం తేదీ నిర్ణయించగానే నెల రోజుల్లోగా వారందిరినీ ధర్మాజిపేటకు తరలించనున్నట్లు అటవీశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే కవ్వాల్ నుంచి మరికొన్ని గ్రామాలను, అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని పలు గ్రామాలను తరలించేందుకు అటవీశాఖ కసరత్తు చేస్తోంది.
పూర్తిగా చదవండి..Nirmal: కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధం
కవ్వాల్ టైగర్ రిజర్వులోని గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ధర్మాజిపేటకు నెలరోజుల్లో తరలించనున్నారు. వీరి కోసం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Translate this News: