Medak : భార్య కాపురానికి రాలేదని అత్తపై దారుణం.. నిద్రలో ఉండగా!

భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అత్త సూది కంసమ్మ నిద్రలో ఉన్నప్పుడు అల్లుడు దశరథం దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ భయంకరమైన ఘటన మెదక్ మండలం కలానుశెట్టి గ్రామంలో జరిగింది.

New York: ప్రియురాలి కోసం సీఈవోను దారుణంగా చంపిన పీఏ!
New Update

Crime : భార్య(Wife) ను కాపురానికి పంపించట్లేదనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా అత్తగారితో గొడవలు పెట్టుకుంటున్న అల్లుడు చివరికీ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. అందరూ నిద్రలో ఉన్నప్పుడు అత్తను దారుణంగా హతమార్చాడు. ఈ భయంకరమైన సంఘటన మెదక్(Medak) మండలం కలానుశెట్టి గ్రామంలో జరిగింది.

పదేళ్ల క్రితం పెళ్లి..
ఈ మేరకు ఎస్సై నవత గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కలానుశెట్టిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం ఈ మర్డర్(Murder) జరిగింది. గ్రామానికి చెందిన సూది కంసమ్మ (50)కు ముగ్గురు కూతుళ్లు. అందరికీ వివాహం జరిగింది. చిన్న కూతురు శోభను పదేళ్ల క్రితం మెదక్ మండలం నవాబ్ పేట గ్రామానికి చెందిన దశరథంకు ఇచ్చి పెళ్లి చేశారు. కొద్దిరోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి దశరథం శెట్టిపల్లి గ్రామానికి వచ్చి తన భార్యను కాపురానికి పంపడం లేదని కంసమ్మతో గొడవ పడ్డాడు. అనంతరం వాదించి వెళ్లిపోయాడు.

కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి..
అయితే మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి కంసమ్మ రక్తపు మడుగులో పడివుంది. ఆమె చనిపోయినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు చెల్లి బాలమణి సొంత అల్లుడే తన అక్కను చంపాడని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Also Read : చిన్నారులపై లైంగిక దాడి.. కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు: వీడియో!

#murder #son-in-law-who-killed-his-aunty #medak
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి