ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ లో రసవత్తర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో విశాఖ ఎంపీ సీటు విషయంలో బీజేపీలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ సీటు కోసం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు. వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని పురంధేశ్వరి భావిస్తుండగా తనకు కూడా అదే సీటు కావాలని జీవీఎల్ తేల్చి చెబుతున్నారు. దానికి అనుగుణంగానే గడచిన రెండేళ్లుగా అక్కడి నుంచే జీవీఎల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునేలా జీవీఎల్ ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో విశాఖ నుంచి గెలిచిన అనుభవం పురంధేశ్వరికి ఉంది. అయితే ఏ పార్టీతో పొత్తు ఉన్న విశాఖ సీటు బీజేపీకే ఇవ్వాలని వారిరువురు కోరుతున్నారు. మరోవైపు జనసేన కూడా విశాఖ సీటు తమకే కేటాయించాలని చంద్రబాబును కోరుతున్నాయి.
పూర్తిగా చదవండి..Purandeswari vs Gvl : రసవత్తరంగా మారిన విశాఖ సీటు..కన్నేసిన పురంధేశ్వరి, జీవీఎల్
ఏపీ రాజకీయాల్లో విశాఖ ఎంపీ సీటు ఇప్పుడు రసవత్తరంగా మారింది. సీటు తనకంటే తనకంటూ పురందేశ్వరి, జీవీఎల్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ, జనసేనలతో పొత్తు కుదిరితే ఆ సీటు ఎవరికనే సస్పెన్స్ కొనసాగుతుంది.
Translate this News: