ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీలో వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చే నేతల చేరికలపై చర్చించిన నేతలు.. దీంతోపాటు ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేపడుతామని, ఈ యాత్ర విడతల వారీగా జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. యాత్రకు సంబంధించిన తేదీలను ఏఐసీసీ ఖరారు చేస్తుందన్నారు. జిల్లాల వారీగా బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు, ప్రజలకు నమ్మకం వచ్చేలా గ్యారెంటి కార్డులను అందజేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. దీనికి సంబంధించి విధీవిధానాల కోసం నాలుగు రోజుల్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ కానున్నట్లు వివరించారు.
పూర్తిగా చదవండి..Telangana Congress : ముగిసిన టీ కాంగ్రెస్ నేతల సమావేశం
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Translate this News: