/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-3-19.jpg)
Gopichand's Viswam : యాక్షన్ హీరో గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీను వైట్ల అంటే ఎంటర్టైన్మెంట్ అని అందరికీ తెలుసు. ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాలో కూడా అదే రకమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెబుతున్నారు.
గోపీచంద్ ఈ సినిమాలో కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఆయన లుక్, పెర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీను వైట్ల తనదైన మార్కెటింగ్ స్ట్రాటజీతో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి 'జారీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో గోపీచంద్ యాక్షన్ సీన్లు, శ్రీను వైట్ల కామెడీ టైమింగ్స్, అద్భుతమైన లోకేషన్స్ చూపించారు.
Presenting you the "Journey of Viswam" !!
We enjoyed it thoroughly and worked sincerely to entertain you to the fullest!!
Expecting your best wishes and love!!#Viswam ✨#TheJourneyOfViswam https://t.co/D8Pc8MODD4Macho star @YoursGopichand @KavyaThapar @vishwaprasadtg… pic.twitter.com/TYGUhgALrH
— Sreenu Vaitla (@SreenuVaitla) July 31, 2024
Also Read : అలాంటి రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా : జాన్వీ కపూర్
ముఖ్యంగా ట్రైన్లో జరిగే కామెడీ సీన్లు 'వెంకీ' మూవీని గుర్తు చేస్తున్నాయి. మేకింగ్ వీడియో చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా వరుస పరాజయాల తర్వాత గోపీచంద్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. శ్రీను వైట్ల కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.