Dindukkal: అమానుషం.. నిండు గర్భిణిని బస్సులో నుంచి తోసేసిన భర్త

నిండు గర్భిణిని కదులుతున్న బస్సులో నుంచి తోసేసిన అమానుష ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మద్యం మత్తలో భార్య వళర్మతితో గొడవపడిన పాండియన్‌ బస్సులో నుంచి బయటకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Dindukkal: అమానుషం.. నిండు గర్భిణిని బస్సులో నుంచి తోసేసిన భర్త
New Update

Tamil Nadu: నిండు గర్భంతో (Pregnent) ఉన్న భార్యను కట్టుకున్నవాడే దారుణంగా కడతేర్చాడు. మద్యం మత్తులో ఆ ఇల్లాలితో గొడపెట్టుకున్న దుర్మార్గుడు కదులుతున్న బస్సులో నుంచి ఆమెను కిందకు తోసేశాడు. ఈ అమానుష ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

మద్యం మత్తులో గొడవ..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని దిండిగల్ జిల్లా వెంబార్‌పట్టికి చెందిన పాండియన్‌(24), వళర్మతికి (18) ఎనిమిది నెలల క్రితం పెళ్లైంది. అయితే వళర్మతి ప్రస్తుతం అయిదునెలల గర్భిణి. సోమవారం రాత్రి దంపతులు ఇద్దరు ఆదివారం దిండిగల్‌ నుంచి పొన్నమరావతికి వెళ్లేందుకు గోపాల్‌పట్టి బస్టాండులో బస్సు ఎక్కారు. ఈ క్రమంలోనే పాండియన్‌ మద్యం మత్తులో ఉండగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

ఇది కూడా చదవండి : Imran Khan: ప్లే బాయ్ ని దైవ భక్తునిగా మార్చిన బుష్రా బీబీ ఎవరు? బ్లాక్ మ్యాజిక్ తో పాక్ రాజకీయాలనే మార్చేసిందా?

అక్కడికక్కడే మృతి..

ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన పాండియన్.. కనవాయిపట్టి సమీపంలో పాండియన్‌ భార్య వళర్మతిని బస్సులో నుంచి బయటకు తోసేశాడు. దీంతో బస్సు వేగంగా ఉండటం వల్ల తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బస్సు ఆపిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వలర్మతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందుతుడు పాండియన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#husband-pushed #tamil-nadu #running-bus #pregnant-wife
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe