Murder: భార్య అందంగా తయారవుతుందని..చంపేసిన భర్త!

కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. భార్య దివ్యను ఉమేశ్‌ ఘోరంగా హత్య చేశాడు. దివ్య మేకప్‌ వేసుకొని ఊర్లోకి వెళ్తుండడాన్ని భరించలేకపోయిన ఉమేశ్‌ ఆమెతోచాలా సార్లు గొడవపడ్డాడు. అనుమానపడుతున్న భర్తతో వేగలేక విడాకులకు అప్లై చేసింది దివ్య. దీంతో కక్ష పెంచుకున్న ఉమేశ్‌ ఆమెను చంపేశాడు.

New Update
Murder: భార్య అందంగా తయారవుతుందని..చంపేసిన భర్త!

Murder: భార్య అందంగా ఉండడంతో పాటు..ఊర్లో బాగా తయారై బయటకు వెళ్తుండడాన్ని భర్త సహించలేకపోయాడు. దీంతో ఈ విషయం గురించి భార్యతో అనేకసార్లు గొడవ కూడా పడ్డాడు. చివరికీ నమ్మించి బయటకు తీసుకుని వెళ్లి హత్య చేశాడు. కర్ణాటక రామనగర జిల్లా మాగడికి చెందిన దివ్య (32) , ఉమేశ్‌ లు భార్యభర్తలు. దివ్య ఎప్పుడూ కూడా అందంగా కనపడాలనే ఉద్దేశంతో ఎక్కువగా మేకప్‌ చేసుకుంటూ ఉండేది.

ఈ పద్దతులు నచ్చని ఉమేశ్‌ ఆమెతో నిత్యం గొడవ పడుతూండేవాడు. దీంతో విసిగిపోయిన దివ్య విడాకులకు ఆప్లై చేసింది. దీంతో ఆమెను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్‌ చేశాడు. దీంతో భార్యను తీసుకుని స్థానికంగా ఉన్న ఊజగల్లు దేవాలయానికి వెళ్లింది. ఆమెను హత్య చేయాలనుకున్న ఉమేశ్‌..అక్కడే ఉన్న కొండ వద్దకు తీసుకుని వెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెను చంపేశాడు.

అనంతరం ఆమె మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులను పట్టుకోగా ప్రధాన నిందితుడు ఉమేశ్‌, మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: పదేళ్ల తరువాత స్వాతంత్య్ర వేడుకల్లో రాహుల్‌

Advertisment
తాజా కథనాలు