Maharashtra: అది ధ్రువ్ రాఠీది కాదు..పేరడీ అకౌంట్

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ మీద నమోదయిన కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతని పేరు మీదనున్న అకౌంట్ ధ్రువ్ రాఠీది కాదని..దానితో అతనికి ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. అది ఎవరిది అనేది దర్యాప్తు చేయాలని చెప్పారు.

Maharashtra: అది ధ్రువ్ రాఠీది కాదు..పేరడీ అకౌంట్
New Update

Dhruv Rathi: మహారాష్ట్ర పోలీసులు ప్రముఖ యూట్యూబర్ ధ్రువర్ రాఠీ మీద కేసు నమోదు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి...యూపీఎస్సీ పరీక్షకు హాజరవ్వకుండానే పాసయినట్లు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అయితే ఆ సమాచారం తప్పుడుది అి మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. బిర్లాబంధువు ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు మొదుపెట్టిన తర్వాతనే అసలు విషయం తెలిసింది.

ఓం బిర్లా కుమార్తే అంజలి మీద పెట్టిన ట్విట్టర్ ఖాతా మొదట అందరూ ధ్రువ్ రాఠీదే అనుకున్నారు.కానీ తీరా ఆ అౌంట్ బయోలోకి వెళ్ళ చూస్తే అది అతనిది కాదని..అతని ఫ్యాన్‌ది అని తెలిపింది. ఖాతా బయలో క్లియర్‌గా ఇది ఫ్యాన్‌, పేరడీ ఖాతా. ధ్రువ్‌ రాఠీ అసలైన అకౌంట్‌తో దీనికి ఎటువంటి సంబంధం లేదు అని రాసి ఉంది. దీంతో పోలీసులు ధ్రువ్ రాఠీ మీద పెట్టిన కేసుు కాన్పిల్ చేసి...ఆ అకౌంట్ ఎవరిది అన్నది పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆ ఖతా నుంచి ఈరోజు మరో పోస్ట్ పోస్టయ్యింది. సైబర్‌ విభాగం సూచనల మేరకు సంబంధిత పోస్టులు, వ్యాఖ్యలన్నింటినీ తొలగించాను. వాస్తవాల గురించి తెలియక వేరొకరి ట్వీట్‌లను కాపీ చేసి షేర్ చేసినందుకు క్షమాపణలు అంటూ ధ్రువ్ రాఠీ ఫ్యాన్ పోస్ట్ చేశారు.

Also Read:CM Revanth: జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన.. పరీక్షల వాయిదాలపై ఏమన్నారంటే!

#maharastra-police #account #dhruv-rathi #you-tuber #x
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe