Accident: చెట్టును ఢీకొన్న బస్సు.. 14 మంది మృతి

థాయ్‌లాండ్‌లో 49 మందితో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Accident: చెట్టును ఢీకొన్న బస్సు.. 14 మంది మృతి
New Update

Thailand Bus Crash Kills : థాయ్‌లాండ్‌ (Thailand)లో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రిపూట 49 మంది ప్రయణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పడంతో చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రచౌప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం (Accident)జరిగింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థాలానికి చేరుకున్నారు. ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Also read: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో మార్పులు.. మళ్లీ ఎప్పుడంటే..

#telugu-news #bus-accident #thailand
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe