Guntur Kaaram: 'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డేని అందుకే తీసేశాం: నాగవంశీ

'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డే కు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశాం తప్పితే మరో కారణం లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో వస్తున్న పలు రూమర్లపై నిర్మాత నాగవంశీ మరోమారు స్పందించారు.

Guntur Kaaram: 'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డేని అందుకే తీసేశాం: నాగవంశీ
New Update

Guntur Kaaram Producer Naga Vamsi about Pooja Hegde: 'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డే కు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశాం తప్పితే మరో రీజన్  లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌బాబు-త్రివిక్రమ్ (Mahesh babu - Trivikram) కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో వస్తున్న పలు రూమర్లపై టాలీవుడ్  నిర్మాత నాగవంశీ మరోమారు స్పందించారు. ముందుగా అనుకున్న కథతో సినిమాను రూపొందడం లేదని, దర్శకుడిని మార్చేశారని, సంగీత దర్శకుడిని మార్చేశారని, ముందుగా పూజాహెగ్డేను తీసుకుని ఆ తర్వాత మరో హీరోయిన్‌ను తీసుకున్నారని, సినిమాను రీషూట్ కూడా చేశారని, సినిమా వాయిదా పడుతుందని.. ఇలా పలు రూమర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఈ రూమర్లకు చెక్ పెట్టారు.

publive-image

నిజానికి గుంటూరు కారం సినిమాను ఆగస్టులోనే విడుదల చేయాలనుకున్నామని, అయితే ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 12కు మార్చామని చెప్పారు. అందుకనే 'గుంటూరు కారం' మూవీని  నెమ్మదిగా చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. పూజాహెగ్డే మరో హిందీ చిత్రంలో నటించాల్సి వచ్చిందని, కేవలం డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhari)తో భర్తీ చేశాం తప్పితే మరో రీజన్ లేదని క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌బాబు ఈ సినిమాలో భిన్నంగా కనిపిస్తారని, పండుగకు వచ్చే సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయని వెల్లడించారు. సంక్రాంతికి పక్కాగా ఈ సినిమాను విడుదల చేస్తామని, త్వరలోనే ఫస్ట్ సింగిల్ వస్తుందని చెప్పారు.

publive-image

విజయ్ దేవరకొండ-గౌతమి తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ అని, రష్మికను తీసుకున్నామన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమాను నిర్మిస్తున్నట్టు చెప్పిన నాగవంశీ.. వైష్ణవ్‌తేజ్‌తో ‘ఆదికేశవ’, విష్వక్సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, సిద్ధు జొన్నలగడ్డతో ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు నిర్మిస్తున్నామని చెప్పారు.ఈ మూవీస్ అన్నీ చిత్రీకరణ జరుపుకుంటున్నాయని వివరించారు. అలాగే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు  అర్జున్-త్రివక్రమ్, యంగ్ టైగర్  ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా నిర్మించనున్నట్టు నాగవంశీ వివరించారు.

Also Read: టాలీవుడ్ ను షేక్ చేయబోతున్న క్రేజీ కాంబినేషన్?…ప్రశాంత్ నీల్ మాములోడు కాదుగా

#pooja-hegde #producer-naga-vamsi #guntur-kaaram #sree-leela #mahesh-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి