/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Gun-fire-in-Lokayukta-office.-AR-Head-Constable-Satyanarayana-died-1-jpg.webp)
కర్నూలు (Kurnool) జిల్లా లోకాయుక్త ఆఫీసులో గన్ ఫైర్ కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ్కానిస్టెబుల్ సత్య నారాయణ (AR Head Constable Satyanarayana ) మరణించారు. లోకాయుక్త బందోబస్తుకు ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ వచ్చినట్లు తెలిపారు. బాత్రూమ్ (bathroom) లో ఎస్ఎల్ఆర్ (SLR)తో సత్యనారాయణ కాల్పుకున్నట్లు సమాచారం. అయితే సత్యనారాయణ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు జిల్లా లోకాయుక్త కానిస్టేబుల్ ఆర్.సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. గన్ మిస్ ఫైర్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా లోకాయుక్త కార్యాలంలో ఇటీవలే గార్డ్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కర్నూలు జిల్లా ఎస్పీ ఇతర అధికారులకు వద్ద డ్రైవర్ (Driver)గా ఏఆర్ కానిస్టేబుల్ పని చేశారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అనురాధ (Anuradha), కూతురు పద్మనందిని (Padmanandini), మౌనిక (Maunika)తో కలిసి స్థానికంగా అశోక్ నగర్ (Ashok Nagar) లేబర్ కాలనీ (Labor Colony)లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.
అయితే కర్నూల్ నగరంలోని లోకాయుక్త కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ (AR Head Constable Satyanarayana) గా పోలీసులు (police) గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం జనరల్ హాస్పిటల్ (General Hospital)కి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాఫ్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి ఉంది.