/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
kamareddy murder
TG News: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిపై మోజు పెంచుకున్న ఓ ఇల్లాలు భర్తను చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లావణ్య.. స్థానికుల చెప్పిన కథనం ప్రకారం.. నెమ్లికి చెందిన మైసయ్యకు భార్య రాధ, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. బాన్సువాడలోని బ్యాండ్ మేళం యజమాని నాగరాజు దగ్గర మైసయ్య పని చేస్తున్నాడు. నాగరాజుకు మైసయ్య భార్యతో పరిచయం ఏర్పడింది. ఇది కస్తా... వివాహేతర సంబంధానికి దారితీసింది.
దారుణంగా హత్య:
ఈ విషయం తెలిసి మైసయ్య భార్యను గట్టిగా మందలించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించు కోవాలనుకుని ప్రియుడి నాగరాజుతో కలిసి పక్క ప్లాన్ వేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి డిసెంబర్ 15న ఇంటి నుంచి వెళ్లి పోయ్యారు. వారం రోజుల తర్వాత రాధ ఒక్కతే ఒంటరిగా ఇంటికి వచ్చింది. మైసయ్య ఎక్కడ ఉన్నాడని తల్లిదండ్రులు రాధను ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు వెళ్లాడని సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఇంటి నుంచి రాధ వెళ్లిపోయింది. కొన్ని రోజులకు మైసయ్య తల్లిదండ్రులకు బాన్సువాడలో రాధ కనిపించింది.
ఇది కూడా చదవండి: గుమ్మడికాయతో గుమ్మడికాయంత పొట్టైనా కరగాల్సిందే
కొడుకు కనిపించక.. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఈ నెల 21 మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసయ్య మిస్సింగ్పై కేసు నమోదు చేసి పోలీసులు రాధ, నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా మైసయ్య హత్య చేసినట్లు చెప్పారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి దుర్కి శివారులో ఉన్న సోమలింగేశ్వర ఆలయ ప్రాంగణం దగ్గర ఉన్న కోనేరులో పడేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. అనంతరం పోలీసులు కోనేరు వద్దకు వెళ్లి చూశారు. కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. అక్కడే పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు మైసయ్య మృతదేహాన్ని అప్పగించారు. రాధ, నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిడ్డని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మెరిసే చర్మం కోసం రైస్ ఫేస్ మాస్క్.. ఈ టిప్ ట్రైయ్ చేయండి