Bomb threat : హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు

హనుమకొండ జిల్లా కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి కాల్ చేసి మరీ బెదిరించాడు. వెంటనే జిల్లాకోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు.

New Update
Hanumakonda District Court

Hanumakonda District Court

హనుమకొండ జిల్లాలోని కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి కాల్ చేసి మరీ చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన హనుమకొండ జిల్లా కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబు స్క్వాడ్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు. హనుమకొండ కోర్టులోపల ఉన్నవారిని బయటకు పంపించారు. అనుమానస్ప ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ టీం తనిఖీలు చేస్తోంది. పోలీసు జాగిలాలతోో కోర్టు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫోన్ చేసిన నెంబర్ ఎవరిదని ఎంక్వైరీ చేస్తున్నారు. కోర్టులో నిజంగానే బాంబు ఉందా.. లేక బెందిరించాలని తమాషాకి అతను కాల్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు