BIG BREAKING : ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు ఊరట

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జెరూసలేం ముత్తయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో ముత్తయ్యను తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

New Update
BREAKING

BREAKING

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జెరూసలేం ముత్తయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో ముత్తయ్యను తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో 2017లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై సెప్టెంబర్ 22వ తేదీన వాదనలు ముగించిన జస్టిస్ సీజేఐ గవాయ్ ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. ఓటుకు నోటు కేసులో ముత్తయ్య ఏ4గా ఉన్నారు. 

డబ్బు ఆశ చూపారని ఆరోపణలు

ఈ కేసు 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది. అప్పటి టీడీపీ నాయకులు ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్)ను తమ అభ్యర్థికి ఓటు వేయడానికి డబ్బు ఆశ చూపారని ఆరోపణలు ఉన్నాయి. జెరూసలేం మత్తయ్య... టీడీపీ నాయకులకు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. 

Advertisment
తాజా కథనాలు