/rtv/media/media_files/2025/05/26/NpS2qCrNXZp5gAhahooL.jpg)
Sameer and Siraj
Terror Attack : విజయనగరం, హైదరాబాద్లో వరుస పేలుళ్లకు కుట్ర చేసిన సిరాజ్, సమీర్లను ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా విచారణలో సిరాజ్ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పేలుళ్లకు విజయనగరమే తన మొదటి టార్గెట్ అని సిరాజ్ చెప్పినట్లు సమాచారం. నిజానికి, హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండ్లర్ తనకు సూచించినప్పటికీ, ప్రశాంతంగా ఉన్న విజయనగరమే తన మొదటి లక్ష్యమని వాళ్లకు చెప్పానని సిరాజ్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పేలుళ్లు ఎలా చేయాలి అనే అంశంలో సౌదీలో శిక్షణ తీసుకున్నట్లు కూడా అతడు అంగీకరించాడట. పేలుళ్ల కోసం విజయనగరంలో ప్రధానంగా 4 ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు కూడా అంగీకరించాడట. ఇక మరోవైపు పేలుళ్లపై పాకిస్థాన్లో శిక్షణ తీసుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో సమీర్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్లోనే (VIDEO)
కాగా ఉగ్రవాదులుగా మారడమే కాకుండా సొంతగడ్డమీదే మారణహోమం చేద్దామనుకున్నాడు..విజయనగరానికి చెందిన సిరాజ్. మరో ఉగ్రవాద సమీర్ తో కలిసి పోలీసులకు పట్టుబడటంతో ఉగ్ర కుట్ర బయట పడింది. విజయనగరం ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ పుట్టినందున సొంత గడ్డని ప్రేమగా చూసుకోవాల్సిన సిరాజ్..తన ఉగ్ర ఆలోచనల్లో భాగంగా శవాల దిబ్బగా మార్చాలనుకున్నాడు. సమీర్. సిరాజ్ ల ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాంబు పేలుళ్ల కోసం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాలలో రెక్కి నిర్వహించినట్లు విచారణలో అంగీకరించారని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ఈ ఇద్దరికీ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో లింకులు ఉన్నాయా అని కోణం లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. వీరికి సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు ఇచ్చిన హ్యాండ్లర్ ను గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. హైదరాబాదులో పేలుడు పదార్థాలు కొంటే దొరికిపోతామని భావించి విజయనగరం నుండి ఆపరేషన్ ను సిరాజ్,సమీర్ ప్లాన్ చేసినట్టు ప్రాథమికంగా తేలింది. వీరిద్దరి అరెస్టుతో ఒక భారీ కుట్రకు తెరపడినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్డేట్.. పుతిన్ హెలికాప్టర్పై ఉక్రెయిన్ బాంబు దాడి