/rtv/media/media_files/2025/06/23/raghunandan-2025-06-23-14-42-24.jpg)
బీజేపీ లీడర్, మెదక్ ఎంపీ రఘునంధన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రం లోగా చంపేస్తామంటూ రఘునంధన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టులు కాల్ చేసి మరీ బెదిరించారు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టునంటూ ఆగంతకుడు ఫోన్ లో ఆయన్ను బెదిరించాడు. ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఫోన్కాల్ను రఘునందన్ పీఏ లిఫ్ట్ చేశారు. వెంటనే రఘునంధన్ రావు బెదిరింపు కాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అలెర్ట్ అయిన డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ ఆయన ఇంటివద్ద భద్రతను మరింతగా పెంచారు. రఘునంధన్ రావుకు బెదిరింపు కాల్ రావడం ఇప్పుడు రాష్ట్రరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.